Home ఆంధ్రప్రదేశ్ బద్వేల్‌ ఉపఎన్నికలో 90 వేలు దొంగఓట్లు: తులసిరెడ్డి

బద్వేల్‌ ఉపఎన్నికలో 90 వేలు దొంగఓట్లు: తులసిరెడ్డి

105
0

అమరావతి నవంబర్ 2
బద్వేల్‌ ఉపఎన్నికలో మొత్తం లక్షా 46వేల 562 ఓట్లు పోలయ్యాయని.. అందులో ప్రజలు 40 శాతం ఓట్లు వేశారని, దొంగఓట్లు 60 శాతమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ  ఈ మొత్తం ఓట్లలో దాదాపు 90 వేలు దొంగఓట్లని అన్నారు. 56వేలు ప్రజలు వేసిన ఓట్లన్నారు. అధికారపార్టీ నేతలు ఓటుకు రూ. 5వందలు ఇచ్చారన్నారు. ఉదయం 11 గంటల తర్వాత వైసీపీ కార్యకర్తలు సీమ నుంచి వచ్చి అధికారపార్టీకి దొంగఓట్లు వేశారన్నారు. చెప్పాలంటే క్షేత్రస్థాయిలో ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ బలహీనంగా ఉన్నాయన్నారు. దానికి తోడు వాళ్లపై అధికారపార్టీ కక్షలు, కేసులతో బెదిరింపులకు గురిచేసిందని, ప్రజలు స్వచ్చంధంగా ఓటు వేసే పరిస్థితి లేదని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

Previous articleశ్రీ హజరత్ మస్తాన్వలి గంధ మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాని
Next articleన్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో… సీబీఐపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here