Home నగరం ఆర్మీ హెలిక్యాప్ట‌ర్ ఫోర్స్ ల్యాండింగ్ లో మృతి చెందిన పైల‌ట్లకు ఘ‌నంగా నివాళి

ఆర్మీ హెలిక్యాప్ట‌ర్ ఫోర్స్ ల్యాండింగ్ లో మృతి చెందిన పైల‌ట్లకు ఘ‌నంగా నివాళి

149
0

శ్రీన‌గ‌ర్ సెప్టెంబర్ 22 (ఎక్స్ ప్రెస్ న్యూస్);: ఆర్మీ హెలిక్యాప్ట‌ర్ ఫోర్స్ ల్యాండింగ్ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన ఇద్ద‌రు మేజ‌ర్లు రోహిత్ కుమార్‌, అనూజ్ రాజ్‌పుత్‌ల‌కు భార‌త సైన్యం ఘ‌నంగా నివాళులర్పించింది. ఆర్మీ ఉన్న‌తాధికారులు వారి భౌతిక‌కాయాల‌పై పుష్పగుచ్ఛాలుంచి అంజ‌లి ఘ‌టించారు. ఉధంపూర్ జిల్లా కేంద్రంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం ప‌ట్నిటాప్ స‌మీపంలో ఆర్మీకి చెందిన ఏవియేష‌న్ హెలిక్యాప్ట‌ర్ అదుపుత‌ప్ప‌డంతో బ‌ల‌వంతంగా ల్యాండ్ చేశారు.ఈ ఘ‌ట‌న‌లో ఆ హెలిక్యాప్ట‌ర్‌లోని ఇద్ద‌రు పైల‌ట్లు మేజ‌ర్ రోహిత్ కుమార్‌, మేజ‌ర్ అనూజ్ రాజ్‌పుత్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెంట‌నే ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న స్థానిక పోలీసులు చికిత్స నిమిత్తం వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ప్ర‌మాదానికి గ‌ల కారణాలు తెలియాల్సి ఉంది.

Previous articleశ్రీవారి దర్శనానికి వచ్చే వారు రెండు డోసుల సర్టిఫికెట్‌ తప్పనిసరి
Next articleకుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి: ఎర్రబెల్లి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here