Home జాతీయ వార్తలు పేపర్‌ రోల్‌ గోదామ్‌లో భారీ అగ్నిప్రమాదం

పేపర్‌ రోల్‌ గోదామ్‌లో భారీ అగ్నిప్రమాదం

95
0

న్యూఢిల్లీ అక్టోబర్ 11
దేశ రాజధాని ఢిల్లీలోని హర్ష్‌ విహార్‌లో ఉన్న పేపర్‌ రోల్‌ గోదామ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది క్రమంగా అవి గోదామ్‌ మొత్తానికి విస్తరించాయి. మంటల ధాటికి మూడంతస్తుల గోదామ్‌ కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 16 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.గోదామ్‌లో పనిచేస్తున్న కార్మికులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరూ గాయపడలేదని చెప్పారు. సోమవారం తెల్లవారుజామున 3.36 గంటలకు తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ చీఫ్‌ అతుల్‌ కుమార్‌ తెలిపారు. మంటలను అదుపు చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టిందని వెల్లడించారు.

Previous articleమేడ్–ఇన్–ఇండియా క్రిప్టో ఎక్స్ చేంజ్ ‘బిట్స్జ్’ ప్రారంభం హైదరాబాద్ లో జరిగిన వేడుకలో ఎక్స్ ఛేంజ్ ను ప్రారంభించిన ప్రముఖ తార నిధి అగర్వాల్
Next articleసాదా …సీదా గా సామాన్యుడిలా… !! ఆత్మీయంగా..!! గరీబొల్ల హోటల్ లో… గరీబోళ్ల లా టిఫిన్ చేసిన మంత్రి హరీష్ రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here