Home ఆంధ్రప్రదేశ్ సింహాచలంలో ఆర్జీత సేవలు

సింహాచలంలో ఆర్జీత సేవలు

123
0

విశాఖపట్నం
విశాఖ శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వా మి వారి దేవాలయములో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువ జామున స్వామిని  సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. శ్రీ దేవి, భూదేవి సమేత గోవింద రాజు స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపములో వేదికపై అధీష్టింపజెసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి సహస్ర నామార్చన, నిత్య కళ్యాణం కమనీయంగా జరిపించిన అనంతరం  వెండి గరుడ వాహనము పై స్వామి వార్ని ఆదీష్టింపజేసి వైభవంగా శ్రీ స్వామి వారి గరుడ వాహన సేవను నిర్వహించారు. ప్రత్యక్షంగా మరియు  పరోక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు

Previous articleజవహార్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని, కప్రా రెవిన్యూ సర్వే నం 706 ,ప్రభుత్వ భూమి కబ్జా
Next articleదసరాకు 8 ప్రత్యేక రైళ్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here