Home ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారతలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ మహిళలు, బాలికలు ఆరోగ్యం, పరిశుభ్రతే...

మహిళా సాధికారతలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ మహిళలు, బాలికలు ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ కార్యకమ్ర లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

107
0

అమరావతి అక్టోబర్ 5
మహిళా సాధికారతలో ఏపీ మొదటి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ కార్యకమ్ర లక్ష్యమని తెలిపారు. ‘స్వేచ్ఛ’ పథకం అమలుపై నోడల్‌ అధికారిగా మహిళా టీచర్‌ను నియమించామని తెలిపారు.  రుతుక్రమ సమస్యలతో చదువులు ఆగిపోతున్నాయని, 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందజేస్తామని తెలిపారు. 10లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాపికిన్లు పంపిణీ చేస్తామని సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10, 388 స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి నెల జేసీ (ఆసరా) ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరగాలని పేర్కొన్నారు. మహిళా టీచర్లు, ఏఎన్‌ఎంలు బాలికలకు అవగాహన కల్పించాలని, దిశ యాప్‌, దిశ చట్టం గురించి వివరించాలని అన్నారు. వైఎస్సార్‌ చేయూత స్టోర్లలో శానిటరీ న్యాప్‌కిన్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చరిత్రను మార్చే శక్తి మహిళలకే ఉందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం తమదని సీఎం జగన్‌ తెలిపారు

Previous articleరెండు, మూడు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
Next articleగ్రామస్థాయి నుండి ఫిట్నెస్ పెంపొందించాలి అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here