విశాఖపట్నం
విశాఖ మన్యంలో రహదారి సౌకర్యం లేక పురిటి నొప్పులతో నిండు గర్భవతి పాపకు జన్మనిచ్చి గిరిజన మహిళ ఇంటి వద్ద మృతి చెందింది. అంబులెన్స్ కు ఫోన్ చేసినా రహదారి లేని కారణంతో రాలేదు. ఈ ఘటన విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ మారుమూల ప్రాంతమైన ఎదురుపల్లి గ్రామంలో గెమ్మిల బాబురావు భార్య గెమ్మిల దివ్య 27సo,అనే గిరిజన మహిళ నిండు గర్భవతి రాత్రి నొప్పులు రావడంతో పురిటి నొప్పులతో బాధపడుతూ పాపకు జన్మినిచ్చి మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు బాబులు ఒక పాప జన్మించగా నాలుగవ గర్భందాల్చి పాపకు జన్మనిచ్చి మృతి చెందింది. దివ్య మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి