విజయవాడ
విజయవాడ నగర శివారు ప్రాంతం జలమయం అయింది. సోమవారం తెల్లవారు జామునుండి కుండపోతగా భారీ వర్షం కురిసింది. కండ్రిక, ఎల్ బీఎస్ నగర్ , పాయకపురం, రాజీవ్ నగర్ ప్రాంతాలలో ఇళ్ళలోకి వరద నీరు చేరింది, నున్నపోలీస్ స్టేషన్ నీట మునిగింది. నూజివీడు విజయవాడ రహదారీ నగర శివారులో రెండు అడుగుల మేర వరద నీరు నిలిచింది. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.