జగిత్యాల,అక్టోబర్ 19
లీడ్ ఇండియా ప్రోగ్రెసివ్ స్కూల్స్,కాళేజస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం మిషన్ పక్షాన భారతరత్న,మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90వ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు మేకల రావడం పట్ల జగిత్యాల రెడ్డి జేఏసి జిల్లా అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డితో పాటు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.సంగీత రెడ్డి
పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు,విద్యా బోధన కోసం అహర్నిశలు కష్టపడే టీచర్ తోపాటు కరస్పాండెంట్ గా విశిష్ట సేవలు అందించిన సంగీత రెడ్డికి హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఉత్తమ జాతీయ టీచర్ అవార్డును రవీంద్ర భారతిలో ప్రధానం చెయడం గర్వకారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
గతంలో అమెకు రెండు సార్లు బెస్ట్ కరస్పాండెంట్ అవార్డులు తీసుకున్నారని, సామాజిక సేవలోనూ ముందుండే సంగీత రెడ్డికు కలాం మిషన్ అవార్డు ఇవ్వడం తగిన గుర్తింపు ఇచ్చి నట్లేందని
కిషన్ రెడ్డి ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రెస్సా అధ్యక్షులు పాపిరెడ్డి, ఎమ్మెల్యే హరిప్రియలు హాజరై
సంగీత రెడ్డిని ఆశీర్వదించడం అభినంధనియమని రెడ్డి జేఏసి మహిళా ప్రతినిధులు రజీతా, వరలక్ష్మి, మంజుల, మాధురి,రొహితా,అరుణా, మహేశ్వర్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి,వసంత రెడ్డి, రవీందర్ రెడ్డి,దశరథ్ రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు