గోసుపాడు
గోసుపాడు మండలం రాయపాడు గ్రామ నివాసి తెలుగుదేశం పార్టీ నాయకులు అకే పోగు శ్రీనివాసుల కుమారుడు చిరంజీవి బైక్ అక్సిడెంట్ జరిగిన వెంటనే శాంతిరామ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వెంటనే శాంతిరామ్ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. అతనికి ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు . ఆయన వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.