Home తెలంగాణ తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెల్లండి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌ను టీఆర్ఎస్...

తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెల్లండి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌ను టీఆర్ఎస్ ప్రజాప్ర‌తినిధులు వినతి

123
0

హైద‌రాబాద్ నవంబర్ 18
యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌ను టీఆర్ఎస్ ప్రజాప్ర‌తినిధులు కోరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మంత్రుల బృందం విన‌తిప‌త్రం అంద‌జేసింది. ఈ కార్య‌క్ర‌మంలోమంత్రులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ పాల్గొన్నారు.
మ‌హాధర్నాతో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేశాం అని టీఆర్ఎస్ ప్రజాప్ర‌తినిధులు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ అసంబద్ధ విధానాల మూలంగా తెలంగాణ ప్రభుత్వానికి ధర్నా చేయక తప్పని అనివార్య పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. తెలంగాణ ఉద్యమమే రైతులు, వాళ్ల సమస్యల చుట్టూ తిరిగింది అని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్ర గవర్నర్ గా ఇది మీరు సంతోషించాల్సిన అంశం అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందిస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులను అయోమయానికి గురిచేస్తుంది అని చెప్పారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే తెలంగాణ ప్రభుత్వం వారికి నష్టం కలిగితే ఎంత పెద్ద పోరాటానికైనా సిద్దం అని తేల్చిచెప్పారు.

Previous articleరానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు అర గుండు, అర మీసం తో నే ఉంటా
Next articleమరింత మెరుగ్గా 108 సేవలు అంబులెన్స్ సేవలను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here