Home ఆంధ్రప్రదేశ్ కారు బోల్తా పడి మున్సిపల్ డీఈ కి గాయాలు.. చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి...

కారు బోల్తా పడి మున్సిపల్ డీఈ కి గాయాలు.. చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలింపు

109
0

నందికొట్కూరు. నవంబర్ 03

ప్రమాదవశాత్తు కారు బోల్తా పడి ఆత్మకూరు మున్సిపల్ డీఈ నరేష్ కు  గాయాలయ్యాయి. ప్రమాద సంఘటన తెలుసుకున్న నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బాని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు.పట్టణ ఎస్ఐ ఎన్ వి రమణ తన సిబ్బంది తో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నారు.బాధితులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. నందికొట్కూరు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు స్థానికులు పోలీసుల కథనం మేరకు ఆత్మకూరు మున్సిపాలిటీలో డీఈ గా విధులు నిర్వహిస్తున్న నరేష్  పనులు పూర్తి చేసుకుని మంగళవారం అర్ధరాత్రి సమయంలో  ఇటికా కారులో ఆత్మకూరు నుంచి కర్నూలు కు బయలుదేరారు.నందికొట్కూరు కోర్టు సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది.డీఈ కి  గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బాని, పట్టణ ఎస్ఐ రమణ సకాలంలో స్పందించారు. క్షత్రగాత్రులను కారులో నుంచి బయటకు తీసి 108 కి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న డీఈ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.   సకాలంలో స్పందించిన వైస్ చైర్మన్, పట్టణ ఎస్ఐ లకు స్థానికులు అభినందించారు.

Previous articleఅతిరథమహారధుల నడుమ బుచ్చి కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చైర్ పర్సన్ అభ్యర్థిని మోర్ల సుప్రజ గెలుపుకు కృషి ప్రసన్న ,కాకాని ఆధ్వర్యంలో వైకాపాలో చేరిన టిడిపి నాయకులు
Next articleహుజురాబాద్‌ ఫలితంపై కాంగ్రెస్‌ శ్రేనుల మేదోమదనం గాంధీ భవన్ లో వాడివేడి చర్చ రేవంత్‌ వ్యవహారశైలిపై కాంగ్రెస్‌ సీనియర్లు ఆగ్రహం దారుణ ఓటమికి కారణాలెన్నో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here