Home జాతీయ వార్తలు ఇండియాలో క‌రోనా బి.1.1.529 వేరియంట్ న‌మోదు కాలేదు

ఇండియాలో క‌రోనా బి.1.1.529 వేరియంట్ న‌మోదు కాలేదు

264
0

న్యూఢిల్లీ నవంబర్ 26
ద‌క్షిణాఫ్రికా, బోత్సువానాలో న‌మోదు అయిన క‌రోనా బి.1.1.529 వేరియంట్ ద‌డ‌పుట్టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ వేరియంట్‌కు చెందిన కేసులు ఇండియాలో న‌మోదు కాలేద‌ని అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. బి.1.1.529 వేరియంట్‌కు చెందిన ఒక్క కేసు కూడా న‌మోదు కాలేద‌ని చెప్పారు. బి.1.1.529 వేరియంట్‌లో ఉన్న స్పైక్ ప్రోటీన్లు తీవ్ర స్థాయిలో మ్యుటేట్ అవుతున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. ఈ నేప‌థ్యంలో వాళ్లు వార్నింగ్ ఇచ్చారు. సౌతాఫ్రికా, బోత్సువానా, హాంగ్‌కాంగ్ నుంచి వ‌స్తున్న ప్ర‌యాణికుల‌పై స్క్రీనింగ్ చేస్తున్నారు. బి.1.1.529 వేరియంట్ 50 మ్యుటేష‌న్లకు లోనైంద‌ని, దానిలో స్పైక్ ప్రోటీన్లు 30 సార్లు ప‌రివ‌ర్త‌న చెందిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

Previous articleనిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ ‘స్కై లాబ్’ నుంచి ‘ రా రా లింగా..’ పాట విడుద‌ల .. సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్‌
Next articleస‌మ్మె ప్ర‌తిపాద‌న‌ను విర‌మించుకున్న జూనియ‌ర్ డాక్ట‌ర్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here