న్యూఢిల్లీ అక్టోబర్ 2
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. నేడు కోవిడ్ వ్యాక్సినేషన్లో ఇండియా కొత్త మైలురాయిని చేరుకున్నది. 90 కోట్ల మందికి కోవిడ్ టీకాలు ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. ఆయన తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. ఇప్పటి వరకు 90 కోట్ల డోసుల టీకాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. కోవిడ్పై ప్రభుత్వం అసాధారణ రీతిలో పోరాటం చేస్తోందని మంత్రి చెప్పారు.