Home ఆంధ్రప్రదేశ్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

156
0

తుగ్గలి
డీలర్ల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తుగ్గలి మండల డీలర్లు ధర్నా నిర్వహించారు.వివరాల్లోకి వెళ్ళగా రాష్ట్ర పిలుపు మేరకు డీలర్ల అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి,ఉపాధ్యక్షుడు సుంకన్న ఆధ్వర్యంలో తుగ్గలి మండలం డీలర్లు ఈ-పాస్ మీటర్లు మొరాయింపు వలన స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర బుధవారం రోజున తుగ్గలి మండలం డీలర్లు ధర్నా నిర్వహించడం జరిగింది.అనంతరం డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్.ఐ సుధాకర్ రెడ్డి కు మెమోరాండం ను అందజేశారు.ఈ-పాస్ మిషన్ వలన ప్రభుత్వ ధాన్యాల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోండడం వలన ఈ-పాస్ మీటర్లు ఎమ్మార్వో ఆఫీస్ లో డీలర్లు అప్పజెప్పారు.ఈ నెల 19న ప్రారంభమైన పిఎంజికేవై పంపిణీలో ఈపాస్ మిషన్లు సరిగ్గా పనిచేయక డీలర్లు మరియు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలియజేశారు.ప్రభుత్వం వెంటనే డీలర్లపై చొరవచూపి ఈ-పాస్ మిషన్ లను మరియు సర్వర్లను సరిగ్గా పనిచేసే విధంగా రూపొందించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డీలర్ మహమ్మద్,రాజశేఖర్, వెంకటేశ్వర్ రెడ్డి,సుదర్శన్,గౌరన్న,చంద్రన్న మరియు పురుషోత్తం తదితర డీలర్లు పాల్గొన్నారు.

Previous articleరేషన్ షాపుల వద్ద గుడ్డ సంచులు పంపిణీ చేసిన బిజెపి మహిళా మోర్చా విభాగం
Next articleడోన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతపేట డోన్ నందు జరిగిన పి యం సి ఎన్నికలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here