Home తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రజావాణికి...

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రజావాణికి 30 ఫిర్యాదులు

269
0

కామారెడ్డి నవంబర్ 01

కామారెడ్డి జిల్లా రామారెడ్డి  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కల్పించిన వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ రోజుకామారెడ్డి  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 30 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవిన్యూ 20, గ్రామపంచాయతీ 4, పోలీస్ శాఖ 3, సివిల్ సప్లై , గృహ నిర్మాణ, సహకార శాఖలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.

Previous articleప్రజా దివాస్ 10 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
Next articleప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here