Home జాతీయ వార్తలు అదుపుత‌ప్పి లోయ‌లోప‌డ్డ బస్ ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం

అదుపుత‌ప్పి లోయ‌లోప‌డ్డ బస్ ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం

93
0

జ‌మ్ముక‌శ్మీర్‌ అక్టోబర్ 28
జ‌మ్ముక‌శ్మీర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌యాణికుల‌తో థాత్రి నుంచి దోడాకు వెళ్తున్న ఓ మినీబ‌స్సు మార్గ‌మ‌ధ్య‌లో అదుపుత‌ప్పి లోయ‌లోప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఎనిమిది మంది అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌న‌పై స్థానికుల ద్వారా స‌మాచారం అందిన వెంట‌నే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్క‌డికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.కాగా, ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ప్ర‌ధాన‌మంత్రి నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కో కుటుంబానికి రూ.2 ల‌క్‌ుల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. అదేవిధంగా ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి రూ.50 వేల చొప్పున్న ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామ‌ని తెలిపారు. అదేవిధంగా జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌భుత్వం కూడా మృతుల‌కు రూ.2 ల‌క్ష‌లు, క్ష‌త‌గాత్రుల‌కు రూ.1 ల‌క్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు జ‌మ్ముక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న చేసింది.

Previous articleహుజురాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక లక్ష 50 వేల మందికి 3 గంటల్లో 90 కోట్ల రూపాయలను పంపిణీ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్
Next articleఅర్చకులు, సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా వేతనాలు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here