Home ఆంధ్రప్రదేశ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.. ఎమ్మెల్యే

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.. ఎమ్మెల్యే

294
0

పత్తికొండ టమోటా మార్కెట్ ని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరిశీలించి రైతులు,వ్యాపారులతో  మాట్లాడారు. సరుకు ఎక్కువగా  వస్తుండడంతో గత 2 రోజులు గా కొద్దిగా ధరలు తగ్గాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు ఇబ్బంది లేకుండా గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే వ్యాపారుల కు అధికారులకు సూచించారు. అనంతరం మార్కెట్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఇసుక డంపింగ్ యార్డు ను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇక్కడి నుంచి ఇసుక సరఫరా చేస్తామనీ తెలియజేశారు. అధికారులు, వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Previous articleపరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసిన సిఎం జగన్
Next articleసెల్ షాప్ యజమానిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here