హైదరాబాద్
గచ్చిబౌలిలోని మై హోమ్ విహంగ లో నివాసం ఉంటున్న శతాబ్ది (32) తన ఫ్లాట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శతాబ్ది గదిలో నుంచి దుర్వాసన రావడం గమనించిన తోటి రూమ్మేట్స్ వెంటనే అపార్ట్ మెంట్ సెక్యూరిటీకి సమాచారం అందించారు. గది తలుపులు బద్దలు కొట్టి చూస్తే, చున్నీతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతి చెందినట్లు సెక్యురిటీ సిబ్బంది గమనించారు. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శతాబ్ది ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన తరలించారు.