Home ఆంధ్రప్రదేశ్ బ‌హిరంగ ప్ర‌దేశాల్లో గ‌ణేశ్ ఉత్స‌వాలు జ‌రుప‌వ‌ద్దు :ఏపి హైకోర్టు కీల‌క తీర్పు

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో గ‌ణేశ్ ఉత్స‌వాలు జ‌రుప‌వ‌ద్దు :ఏపి హైకోర్టు కీల‌క తీర్పు

77
0

విజయవాడ సెప్టెంబర్ 9
గ‌ణేశ్ ఉత్స‌వాల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు గురువారం కీల‌క తీర్పు చెప్పింది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో గ‌ణేశ్ ఉత్స‌వాలు జ‌రుప‌వ‌ద్ద‌ని ఆదేశించింది. ప్రైవేట్ స్థ‌లాల్లో విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చున‌ని పేర్కొంది. దీన్ని ప్ర‌తిప‌క్ష టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన వ్య‌తిరేకిస్తున్నాయి. పండుగ‌ల‌పై ఆంక్ష‌లు విధించ‌డ‌మేమిటంటూ ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నాయి. దీనిపై దాఖ‌లైన పిటిష‌న్‌ను విచారించిన ఏపీ హైకోర్టు.. గ‌ణేశ్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు ష‌ర‌తులు విధించింది. క‌రోనా నేప‌థ్యంలో గ‌ణేశ్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్‌ నిషేధాజ్ఞ‌లు విధించిన సంగ‌తి తెలిసిందే

Previous articleజువ్వాజి సుంకన్న గౌడ్ సేవాసమితి ద్వారా గర్భిణీలకు ఉచిత భోజనం..
Next articleమందమర్రి లో తెరాస నాయకుడు వినయ్ ఇంటిపై కత్తులతో దాడి దాడిలో వినయ్ సోదరి చేయ్యి తెగిపడిన ఘటన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here