Home ఆంధ్రప్రదేశ్ శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా పుష్పయాగం

శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా పుష్పయాగం

229
0

చిత్తూరు నవంబర్ 11
తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా పుష్పయాగం జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏడు టన్నుల పువ్వులతో టీటీడీ ఆధ్వర్యంలో ‘పుష్ప కైంకర్యం’ నిర్వహించారు. పుష్పయాగంలో భాగంగా ఆలయ కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అత్యంత వైభవంగా నిర్వహించిన పుష్ప కైంకర్యంలో ఏడు టన్నుల పూలను ఉపయోగించారు. ఈ పువ్వులను తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన దాతలు అందజేశారు.ఇలాఉండగా, తిరుమల శ్రీవారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తితిదే ఆధికారులు వారికి సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Previous articleకేంద్రమంత్రి పియూష్ గోయల్ తో మంత్రి మేకపాటి భేటీ
Next articleఏఎన్ఎం సావిత్రి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి ఏ ఏన్ ఎం పై దాడి పట్ల వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు నిరసన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here