Home తెలంగాణ ఆర్జి 1 ఏరియా లో కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేత

ఆర్జి 1 ఏరియా లో కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేత

263
0

పెద్దపల్లి   నవంబర్ 19

ఆర్జి 1 జీఎం కార్యలయంలో మెడికల్ ఇన్ వాలిడేషన్, చనిపోయిన ఎన్ సి డబ్ల్యూ ఏ  ఉద్యోగుల డిపెండెంట్స్ 36 మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు ఆర్జి 1 జనరల్ మేనేజర్ కె.నారాయణ చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్జీ-1 జనరల్ మేనేజర్ కె.నారాయణ మాట్లాడుతూ సింగరేణి సి అండ్ ఏం.డి ఎన్.శ్రీధర్ చొరవతో  త్వరిత గతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించటం జరిగిందని  అన్నారు. మెడికల్ బోర్డ్ కు దరఖాస్తు చేసున్న వారు వెంటనే ఆన్ ఫిట్ అవటం ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులలో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించటం త్వరిత గతిన అవుతుందని అన్నారు. శుక్రవారం ఆర్జీ-1 ఏరియాలో 36 మంది  డిపెండెంట్లకు ఒకే దఫా  కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వడం  జరిగిందని, అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇవ్వటం జరిగిందని అన్నారు. వీరికి ఆర్ జి 1 ఏరియా లో పోస్టింగ్ ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు ఆర్జి 1 ఏరియాలో  946  మందికి కారుణ్య నియామక  ఉధ్యోగాలను అందించటం జరిగిందని, అతి తక్కువ సమయంలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేయటం జరిగిందని అన్నారు. జాయిస్ కాబోవు ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరచు   కొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ప్రస్తుతం బయట ప్రవైట్ ఉద్యోగాలకు కూడా బారి కాంపిటేషన్ ఉందని ఇలాంటి పరిస్థితులలో సింగరేణి ఉధ్యోగం రావటం ఒక వరం లాంటిది అని అన్నారు. రోజు రోజుకి సింగరేణి సంస్థ లో యువ ఉద్యోగుల స్థాయి పెరుతుందని అన్నారు. సింగరేణి భవిష్యత్ యువ కార్మికుల చేతులలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ ఉపాద్యక్షులు గండ్ర ధామోదర్ రావు, సి ఏం ఓ ఏ ఐ అధ్యక్షులు పోనోగోటి శ్రీనివాస్, పర్సనల్  డీజీఎం లక్ష్మీ నారాయణ, సీనియర్ పి ఓ  బంగారు సారంగ పాణి, (శావణ్, మాల్లీశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Previous articleఅపన్న హస్తం అందరి బాధ్యత – మేయర్ అనిల్ కుమార్
Next articleవిద్యుత్ రవ్వలు పడి గుడిసెదగ్ధం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here