హైదరాబాద్ నవంబర్ 9
కాంగ్రెస్ పని ఖతం ఐనది కేసీఆర్ అంటున్నరని, కానీ హుజురాబాద్ లో బీజేపీతో కలిసి కాంగ్రెస్ ఓడగొట్టింది అని సీఎం అనలేదాఅని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసే దమ్ము ఉందాఅని ప్రశ్నించారు.మోడీ కనుసన్నల్లోనే కేసీఆర్ నడుస్తున్నారన్నారు.కేంద్రం వడ్ల కొనుగోలు చేయను అంటే నేను కూడా కొననని కేసీఆర్ అంటున్నాడు.. రాష్ట్ర ప్రభుత్వం ఎం బ్రోకర్ కాదు కదా అని అన్నారు.ఆల్టర్నేటివ్ పంటలు వేయలన్నప్పుడు కనీస మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదు అని రేవంత్ ప్రశ్నించారు.కేసీఆర్ కు ఒక వ్యవసాయ విధానం అంటూ లేదు,కేసీఆర్ సీడ్ కంపెనీలకు అమ్ముడు పోయిండన్నారు.సీఎంకు అధికారం ఇచ్చింది ధర్నాలు చేయడానికా.. వడ్లు కొనాల్సింది పోయి ధర్నాలు చేస్తావా అని ప్రశ్నించారు.ఇన్ని రోజులు మోడీ సంకలో కేసీఆర్ ఉన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై అన్ని ఆధారాలు ఢిల్లీలో ఇచ్చినం.. మోడీపై ఉన్న నమ్మకంతో కేసీఆర్ దైర్యంగా ఉన్నదన్నారు.సంజయ్ కి సవాల్ విసిరిండు మరి మోడీకి సవల్ విసిరే దమ్ము కేసీఆర్ కు ఎందుకు లేదన్నారు.కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్, సంతోష్ ల ఎన్నికల అఫిడవిట్లు చూస్తే ఎంత సంపాదించారో తెలుస్తది ,మందు పోసినోడికే మంత్రి పదవి ఇచ్చిండుకేసీఆర్ బీజేపీని విమర్శించలేదు బండి సంజయ్ ని తిట్టడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నరన్నారు.కేసీఆర్ కుటుంబం అవినీతిలో మ్యూనిపోయిన్ది అని అమిత్ షా జిహెచ్ఎంసి, నిర్మల్ సభలో అనలేదా బండి సంజయ్ ఢిల్లీలో ఎం సాగదు మోడీ, షా తో ఉన్న బంధం వల్లే బండి సంజయ్ ఎం పికలేడని కేసీఆర్ అంటున్నడు కాంగ్రెస్ తో ఉన్న భయంతోనే మోడీ డైరెక్షన్లో బీజేపీని తిడుతున్నాడు కేసీఆర్ ప్రెస్ మీట్లు నాటు సరసంలా ఉన్నాయన్నారు.సన్నాలు పండించమన్న సన్నాసి పండించిన తర్వాత వడ్లను కొనలేదు