కోరుట్ల నవంబర్ 11
కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ ను
గురువారం కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య -అనిల్, వైస్ చైర్మెన్ గడ్డమీది పవన్ లు ప్రారంభించారు .ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో మొదటిసారిగా అన్ని రకాల రక్త మూత్ర పరీక్షలు అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. నాణ్యతతో కూడిన రిపోర్టులు అందించాలని సూచించారు.
ఈ అవకాశాన్ని పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చైర్ పర్సన్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్ దంపతులతో పాటు వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత- గంగాధర్ ,అపోలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రవీంద్ర, నిర్వాహకులు చంద్రశేఖర్,తెరాస యూత్ ప్రధాన కార్యదర్శి పుప్పల నాగరాజు, మైనారిటీ యూత్ నాయకులు ఎండి ఆమెర్ తదితరులు పాల్గొన్నారు.