హైదరాబాద్ అక్టోబర్ 22
దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులర్పించారు. తెలంగాణ భవన్లో నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి కేటీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.