Home తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవ బాధిత వ్యక్తికి రూ. 4 లక్షల ఎల్...

మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవ బాధిత వ్యక్తికి రూ. 4 లక్షల ఎల్ వో సి అందజేత

171
0

జగిత్యాల నవంబర్ 11
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిర్మలాపురంకు చెందిన బ్రహ్మయ్య కుమారుడు శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కలిసి తన ఆర్థిక పరిస్థితిని వివరించారు. దాంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంటనే స్పందించి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు శ్రీనివాస్ దరఖాస్తును పంపగా మెరుగైన వైద్య సేవల కోసం రూ. 4 లక్షల రూపాయల ఎల్ వో సి మంజూరు చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పత్రాన్ని వారికి అందించారు. ఆర్థిక సాయం అందించినందుకు ప్రభుత్వానికి, కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఈ సందర్భంగా బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Previous articleజిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా త్వరిత గతిన వడ్ల కొనుగోలు పూర్తి చేయాలి బిజెపి జిల్లా అధ్యక్షులు అరుణతార
Next articleమౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి తీన్ ఖని వద్ద స్మారక స్తూపం ఏర్పాటు చేయాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ అధ్యక్షుడు ముజాహీద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here