హైదరాబాద్
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని.. నేడు ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి బాధ్యతలు చెప్పాట్టారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మాధాపూర్ లోని హైటెక్స్ లో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన సభా ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది టిఆర్ఎస్. శాంతియుతంగా తెలంగాణ సాధించారు. పాలనలోనూ దేశానికి తెలంగాణకు దుక్సూచిగా మార్చారు. 25న ప్లీనరీ లో పార్టీ అధ్యక్షున్ని ఎన్నుకుంటాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
ప్లీనరీ ఉదయం 10గంటలకే ప్రారంభం అవుతుంది. పేర్ల నమోదుకోసం 35కౌంటర్లు ఏర్పాటు చేశాం. నాయకుల వ్యక్తిగత సిబ్బంది కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఆహ్వానించిన వారే రావాలి..ఆహ్వానం లేని వారిని అనుమతించమని అన్నారు.
గులాబీ దుస్తులు ధరించి ప్రతినిధులు ప్లీనరికి రావాలి. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ జెడ్పి చైర్మన్లకు కూడా ఆహ్వానం పంపాము. మొదటి సెషన్ లో ఉదయం10నుంచి మధ్యాహ్నం 1గంట వరకు అధ్యక్షుని ఎన్నిక తీర్మానాలు ఉంటాయి. మధ్యాహ్నం 2తర్వాత ప్రసంగాలు ఉంటాయి. ఏడు తీర్మానాలు ఉంటాయి. కేంద్రాన్ని నిలదీస్తూ కూడా తీర్మానం ఉంటుంది. గాంధీభవన్ లో గాడ్సే జోర్రిండు. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ గోల్కొండ రిసార్ట్స్ లో కలవలేదని చెప్పండి. అప్పుడు ఆధారాలు బయట పెడతామని అన్నారు.
చూసిన వారే మాకు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ల ఉమ్మడి అభ్యర్థే ఈటెల రాజేందర్. ఎన్నికల కమిషన్ కూడా పరిధి అతిక్రమించింది. రాజ్యాంగ బద్ధ సంస్థ అని మరిచిపోయారు. పక్క జిల్లాల్లో కూడా కోడ్ అనడం ఆశ్చర్యగా వుంది. తాను తీసుకున్న సూపారి మీద మానిక్కం మాట్లాడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు.