Home తెలంగాణ మెట్రో ప్రయాణికుడి ట్వీట్టర్ కు స్పందించిన మంత్రి

మెట్రో ప్రయాణికుడి ట్వీట్టర్ కు స్పందించిన మంత్రి

110
0

హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో రైళ్ల ను  ఉదయం 6 గంటల నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని  అభినవ్ అనే ప్రయాణికుడు చేసిన   ట్విట్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు.  ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైలు కోసం ప్రయాణికులు స్టేషన్లకు చేరుకుంటున్నారని…. కానీ మెట్రో 7 గంటలకు ప్రారంభం కానుండడంతో సుమారు గంట పాటు వేచి చూడాల్సి వస్తుందని ప్రయాణికులు వేచి చూసే వీడియోను మంత్రి కేటీఆర్ కు ట్విట్ చేశాడు.   ఉదయం సమయంలో క్యాబ్స్ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయని దీనిని పరిశీలించాలని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.   స్పందించిన మంత్రి కేటీఆర్…ఉదయం 6 గంటల నుంచే మెట్రో ను అందుబాటులోకి తీసుకోచ్చే అంశాన్ని పరిశీలించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కి మంత్రి కేటీఆర్ రిట్విట్ చేశారు. #  నగరంలో మెట్రో రైల్లు మొదటి స్టేషన్ల నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతున్నాయి… చివరి స్టేషన్ నుంచి రాత్రి 10.15 గంటలకు చివరి ట్రైన్ నడుపుతున్నారు.

Previous articleయాగంటిలో కార్తీక శోభ
Next articleఈటల సంస్థకు నోటీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here