హైదరాబాద్ అక్టోబర్ 16 (
మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైనట్లు తెలిపారు. తెలంగాణ భవన్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కేసీఆర్ చేతుల మీదకు గులాబీ కండువా కప్పుకోనున్నారు.మోత్కుపల్లి గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు. టీడీపీ తరఫున అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేండ్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నుంచి బయటికి వచ్చిన మోత్కుపల్లి తాజాగా టీఆర్ఎస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు.