Home ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఎన్ఐయే సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఎన్ఐయే సోదాలు

168
0

హైదరాబాద్/అమరావతి
రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ మావోయిస్టులు, వివిధ సంఘాల నాయకుల ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. హైదరాబాద్ లోని నాగోల్ లో రవిశర్మ ,  భవాని  ఇళ్లల్లో  సోదాలు జరిగాయి. గతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిని రవిశర్మ తరువాత లొంగిపోయారు.  ప్రకాశం జిల్లా లో కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు జరిగాయి. అల్వాల్ సుభాష్ నగర్ లో నివాసముంటున్న అమరుల బందు మిత్రుల సంఘం నేత పద్మ కుమారి ఇంట్లో పోలీసులుసోదాలు జరిపారు. విశాఖపట్నం ఆరిలోవ లో అడ్వకేట్ అన్నపూర్ణ ఇంటి లో కుడా ఎన్ ఎ ఐ సోదాలు జరిగాయి. గతంలో అన్నపూర్ణ ఇంటిపై పలుమార్లు సోదాలు నిర్వహించారు.  గురువారం ఉదయం నుండి ఈ సోదాలు కొనసాగాయి.  సోదాల వివరాలు చెప్పడానికి అధికారులు నిరాకరించారు.

Previous articleనిరసన ర్యాలీ నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యేలు
Next articleమహా ధర్నాకు తరలిని వేములవాడ అర్బన్ టీఆర్ఎస్ నేతలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here