హైదరాబాద్ అక్టోబర్ 18
ఈ నెల 19న ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11:30 గంటలకు యాదాద్రి బయల్దేరనున్నారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి పునఃప్రారంభ తేదీలను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించి వున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారు. పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు