చిత్తోర్ఘడ్ నవంబర్ 20
భారత్లో శాంతిని అస్థిరం చేసి అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, కానీ ఆ దేశానికి ఎప్పుడూ గట్టిగా జవాబు ఇస్తూనే ఉన్నామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ ఆయన పిత్తోర్ఘడ్లో మాట్లాడుతూ.. భారత్ ఇప్పుడో కొత్త, శక్తివంతమైన దేశంగా తయారైందన్నారు. నవంబర్ 18వ తేదీన రీజాంగ్ లాకు వెళ్లానని, కుమావన్ బెటాలియన్కు చెందిన 124 మంది జవాన్లు అక్కడ అద్భుతమ చేశారని, వాళ్లు చేసింది ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. అక్కడ జరిగిన పోరులో 114 మంది జవాన్లు అమరులయ్యారని, కానీ వాళ్లు సుమారు 1200 మంది చైనా సైనికుల్ని చంపేసినట్లు రక్షణమంత్రి రాజ్నాథ్ వెల్లడించారు.