నెల్లూరు
నెల్లూరు జిల్లా ,గూడూరు పట్టణం, పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయంలోని దుర్గాదేవి ఉప పీఠం నందు హిందూ ధర్మ పరిరక్షణ జిల్లా కో ఆర్డినేటర్, సమరసత రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కోటా సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రయోక్తంగా శ్రీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా వారి కాకడ హారతి, నిత్య పూజ, నిత్య రుద్రాభిషేకం, నిత్య నవావరణ హోమమం నిర్వహించారు. వేద పారాయణం, ఆవాహిత దేవతా పూజ, అధివాసాంగ హోమములు, మూల మంత్ర హోమాలు, యోగిని, వాస్తు, క్షేత్ర పాలక, నవగ్రహ సర్వతోభద్ర మండల హోమాలు, శ్రీ విజయ దుర్గా అమ్మవారి మరియు గురుదేవులు వారి సంపూర్ణ అనుగ్రహంతో ,శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ భవాని శంకర స్వామి, శ్రీ సూర్య నారాయణ స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా వార్ల యంత్ర స్థాపన, తదుపరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ భవాని శంకర స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా వార్ల విగ్రహ ప్రతిష్ట విశేషరీతిలో జరిపారు.తదుపరి అష్ట బంధనం, మూర్తి హోమం, జీవన్యాసం, కళాన్యాసం,నాడీఅనుసంధానం,స్పర్