Home ఆంధ్రప్రదేశ్ ఆక్షేపణ లేని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలో గల నివాస గృహములు (300 చ.గజాల) వరకు...

ఆక్షేపణ లేని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలో గల నివాస గృహములు (300 చ.గజాల) వరకు క్రమబద్ధీకరణ ఈ ఏడాది డిసెంబర్ 31 లోగా సచివాలయం/వార్డు కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలి నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

108
0

నంద్యాల, అక్టోబర్ 07

ఆక్షేపణలేని ప్రభుత్వ భూముల్లో 15-10-2019 తేదీ నాటికి ఆక్రమణలో గల నివాస గృహములు (300 చ.గజాల) వరకు క్రమబద్ధీకరించబడునని, ఈ అవకాశాన్ని  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  నంద్యా సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు .225 తేది : 23.08.2021 ఉత్తర్వులు జారీ చేసిందని, కావున ప్రభుత్వం వారు పొందుపరచిన షరతుల దృష్ట్యా అర్హులైన వారు ” సచివాలయం / వార్డు ” కేంద్రాల ద్వారా వారి వివరాలను పొందుపరచి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
సదరు ఉత్తర్వుల ప్రకారము క్రింద కనబరచిన ప్రకారము ఆక్షేపణలేని ప్రభుత్వ భూముల్లో అక్రమాలను క్రమబద్దీకరణ చేస్తామన్నారు.
75 చదరపు గజాల విస్తీర్ణం వరకు : (కేటాయించుటకు చెల్లించాల్సిన ధర) భూమి యొక్క ప్రాథమిక విలువలో 75 శాతం, కుటుంబం కేటగిరీ-1 కి చెందినది మరియు డి ఫారం పట్టాను ఉచితంగా పొందాలనే ఉద్దేశంతో ఆరు దశల ధ్రువీకరణ అర్హత  పొందినట్లయితే, ఆమెరకు డి ఫారం పట్టా జారీ చేయబడుతుందన్నారు .
150 చదరపు గజాల విస్తీర్ణం వరకు : (కేటాయించుటకు చెల్లించాల్సిన ధర) భూమి యొక్క ప్రాథమిక విలువలో 75 శాతం.
150+300 చదరపు గజాల విస్తీర్ణం వరకు : (కేటాయించుటకు చెల్లించాల్సిన ధర) భూమి యొక్క ప్రాథమిక విలువలో 100 శాతం .
కేటగిరి 1 : గ్రామీణ ప్రాంతము
1)సదరు ఆక్రమణ దారు కుటుంబము నెలసరి ఆదాయము అన్ని వనరుల నుండి రూ.10,000/- అనగా సంవత్సరమునకు రూ.1,20,000/- ఆదాయం కలిగి ఉండాలి.
2)10 ఎకరముల మెట్ట భూమి లేదా 3 ఎకరముల తరి భూమి లేదా మెట్ట భూమి మరియు తరి భూమి కలిపి 10 ఎకరముల భూమి వరకు సదరు కుటుంబము కలిగి ఉండవచ్చును.
3)సదరు కుటుంబము నందు ఆదాయపు పన్ను కట్టు సభ్యులు ఉండరాదు.
4)సదరు కుటుంబమునకు 4 చక్రముల వాహనము ఉండరాదు. కాని కుటుంబమునకు టాక్సీ, ఆటో, ట్రాక్టర్ వ్యవసాయమునకు ఉన్నచో మినహాయింపు గలదు.
కేటగిరి 1 : పట్టణ ప్రాంతము :-
1)సదరు  ఆక్రమణ దారు కుటుంబము నెలసరి ఆదాయము అన్ని వనరుల నుండి రూ.12000/- అనగా సంవత్సరమునకు రూ.1,44,000/ – వరుకు ఉండవచ్చును.
2)సదరు కుటుంబము నందు ప్రభుత్వ ఉద్యోగం చేయు సభ్యులు ఉండరాదు. ఐతే కాంట్రాక్టు ఉద్యోగం చేయు వారు ఉండవచ్చును.
3)సదరు కుటుంబము నందు ఆదాయపు పన్ను కట్టు సభ్యులు ఉండరాదు.
4)సదరు కుటుంబమునకు 4 చక్రముల వాహనము ఉండరాదు. కానీ కుటుంబమునకు టాక్సీ, ఆటో, ట్రాక్టర్ వ్యవసాయమునకు ఉన్నచో మినహాయింపు గలదు.
ఇందుకు సంబందించిన దరఖాస్తులను సంబంధిత సచివాలయం/వార్డు కార్యాలయము 31-12-2021 లోగా సమర్పించాలని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. అట్లు సమర్పించని యడల రెవిన్యూ అధికారులు సదరు ఆక్రమణను తొలగించుటకు చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటారని సబ్ కలెక్టర్ తెలియజేశారు.

Previous articleఅప్ప‌లాయ‌గుంట‌లో మినీ కల్యాణకట్ట ప్రారంభం
Next articleబద్వేలు ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్ధి నామినేషన్ దాఖలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here