కుక్కునూరు, అక్టోబర్ 03
పశ్చిమగోదావరి కుక్కునూరు మండలంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పర్యటన చేశారు. పర్యాటనలో భాగంగా కుక్కునూరు పోలీస్ స్టేషన్లలో ఎస్పీ చేతుల మీదుగా మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణ చేశారు. అనంతరం కుక్కునూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో గిరి నేస్తం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణానికి చేరుకున్నజిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మకు ఆదివాసీ సాంస్కృతిక నృత్యాలలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సి,ఎస్టీ లకు చెందిన 100 మంది విద్యార్థులకు ఎస్పీ చేతుల మీదుగా పుస్తకాలు పంపిణి చేశారు.మహిళలపై జరుగుతున్న అత్యాచారలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు దిశా యాప్ ను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కుక్కునూరు డివిజన్ అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి మరియు పోలవరం డిఎస్పీ లతాకుమారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం మహిళలకు దిశా యాప్ గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..విద్యార్థిని,విద్