Home ఆంధ్రప్రదేశ్ ఎస్ఈబి అధికారుల స్పెషల్ డ్రైవ్.. వివరాలు వెల్లడించిన సీపీ శ్రీనివాసులు

ఎస్ఈబి అధికారుల స్పెషల్ డ్రైవ్.. వివరాలు వెల్లడించిన సీపీ శ్రీనివాసులు

134
0

విజయవాడ
విజయవాడలో ఎస్ఈబీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో నగర పోలీసు కమిషనర్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ , గంజాయి ,అక్రమ లిక్కర్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. 6 కోట్ల విలువైన గుట్కా స్వాధీనం చేసుకొని.. 570 మంది పై చర్యలు తీసుకున్నాం. 8వేల కేజీలను గంజాయి సీజ్ చేసి 250 కేసులు నమోదు చేశాం. 14 వందల వాహనాలు సీజ్ చేసి 4 వేల మంది అరెస్ట్ చేశామని అన్నారు.
హెరాయిన్  కేసుపై మరోసారి సీపీ క్లారిటీ
గుజరాత్ హెరాయిన్ కేసుకు విజయవాడకు సంబంధం లేదు. డ్రాగ్ రాకెట్ ఢిల్లీ కేంద్ర కార్యకలాపాలు జరిపింది. విజయవాడ అడ్రస్ ను 2 సార్లు ఉపయోగించారు. నగరంలో రౌడిసీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేశాం. 18 మంది రౌడీ షీటర్స్ లను నగర బహిష్కరణ చేశామని అన్నారు. 116 మందిపై కొత్తగా షీట్స్ ఓపెన్ చేశాం. 3 వేల మంది పై సస్పెక్ట్ షీట్స్ పెట్టి అరెస్ట్ చేసి మండల మెజిస్ట్రేట్ ముందు పెట్టాం. కొండపల్లి ఎన్నికలు ప్రశాంతంగా  జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Previous articleకర్నూలులో లెదర్ ఇండస్ట్రీస్ చిరు వ్యాపారులకు పెట్టించాలని వినతి నల్లా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కేదార్ నాథ్
Next articleభారత భూభాగంలో అక్రమంగా గ్రామం నిర్మించిన చైనా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here