ఖమ్మం నాయుడుపేట పక్కనే మున్నేరులో సోమవారం వందల ఏళ్ల నాటి శివపార్వతుల విగ్రహాలు బయటపడ్డాయి. దీనితో స్థానిక ప్రజలు మున్నేరు వద్ద శివపార్వతులకు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ విగ్రహాలు వందల ఏళ్ల నాటివని స్థానిక ప్రజలు చెపుతున్నారు. అదే విదంగా ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి బయటపడ్డ శివపార్వతుల విగ్రహాలను తిలకిస్తున్నారు.