Home తెలంగాణ ఉపఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డాక్టర్ పోరిక రవీందర్

ఉపఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డాక్టర్ పోరిక రవీందర్

137
0

ములుగు డిసెంబర్  2

ములుగు మండలం  బండారుపల్లి గ్రామంలోని ఉప  ఆరోగ్య  కేంద్రాన్ని ఎయిడ్స్  లెప్రస్ కంట్రోల్  జిల్లా అధికారి  డాక్టర్‌ పోరిక రవీందర్ గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని రికార్డులతో పాటు  కుష్ఠు వ్యాధికి సంబంధించిన రికార్డులను పరిశీలిం చారు. కేసుల వివరాలను ఏఎన్ఎం  సత్యనారాయణమ్మ ద్వారా తెలుసుకున్నారు.
ప్రజలు కుష్ఠువ్యాధిపై అవగాహన కలిగి ఉన్న ప్పుడే వ్యాధి నయం అవుతుందని ఎయిడ్స్ కంట్రోల్   కుష్ఠువ్యాధి నివారణ అధికారి డాక్టర్ రవీందర్ పేర్కొన్నారు. రికార్డులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ చర్మం పాలిపోయినా, లేక రాగివర్ణంలో పొడలు, మచ్చలు, స్పర్శ లేకున్నా, చెమట పట్టినా కుష్ఠువ్యాధి లక్షణాలుగా నిర్ధారించవచ్చన్నారు. ఈ వ్యాధిని బహుళ ఔషధ చికిత్స ద్వారా నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ ప్రమోద్  ఏఎన్ఎం  సత్యనారాయణమ్మ ఆశా కార్యకర్తలు మంజుల, రమ తదితరులు పాల్గొన్నారు

Previous articleముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలో శ్రీ అలమేలుమంగ
Next articleప్రతి ఒక్కరూ సమాచారాన్ని తెలుసుకోవాలి – సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు బొల్లం మధుబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here