జగిత్యాల
జగిత్యాల జిల్లా పట్టణంలోని గాంధీ నగర్ లో విషాదం నెలకొంది. స్థానిక గుట్ట రాజేశ్వర స్వామి వద్ద గల ధర్మసముద్రం చెరువులో పడి ముగ్గురి యువతులు ఆత్మహత్య చేసుకన్నారు. ఇందులో ఇద్దరికి వివాహం అవ్వగా, ఇంకొ యువతి ఇంటర్ చదువుతోంది. ఎక్కల్ దేవి గంగాజల, మల్లిక ల మృతదేహాలు లభ్యం అయింది. మరో యువతి వందన మృత దేహం కోసంగాలింపు కొనసాగుతోంది. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. టౌన్ సిఐ కిషోర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.