Home తెలంగాణ తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో ప్రధాన ఘట్టం.. ...

తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో ప్రధాన ఘట్టం.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

108
0

హైదరాబాద్ సెప్టెంబర్ 17
తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో ప్రధాన ఘట్ట మని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో తెలంగాణ విలీన దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు.బ్రిటిష్ నుంచి భారత్ కు స్వాతంత్ర్య వచ్చినపుడు నిజాం పాలకులు ఇండియాలో విలీనం చేయకుండా స్వతంత్రంగా ఉండాలని లేదా, పాకిస్తాన్ లో విలినం చేయాలని చూసారు.అప్పుడు ప్రధాని జవహర్ లాల్ ఆదేశాలతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో జరిపి తెలంగాణను భారత్ లో విలీనం చేశారన్నారు.తెలంగాణ కు స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజు, తెలంగాణ కు స్వాతంత్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే నన్నారు.ఇప్పుడు కొంతమంది కొత్త బిచ్చగాళ్ల వచ్చారు.వెయ్యి ఉరి ల ఉడల మర్రికి వస్తున్నారు.అది ఎప్పుడు జరిగిందో కూడా వాళ్లకు తెలియదన్నారు. జవాహర లాల్ నెహ్రు నిర్ణయం వల్లనే తెలంగాణ విలీనం జరిగింది. ప్రధాన మంత్రి నిర్ణయం హోమ్ శాఖ మంత్రి అమలు చేస్తారు.బీజేపీ వాళ్ళు తెలంగాణ విలినాన్ని హోమ్ శాఖ మంత్రి సర్దారవల్లభయ్ పటేల్ ది అని చెప్తున్నారు,సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కాంగ్రెస్ అధ్యక్షులుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రిగా పని చేసారన్నది గుర్తించాలన్నారు.బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి ఒక్క నాయకులు కూడా లేరు అందుకే కాంగ్రెస్ నేతల పేర్లు వాడుకుంటున్నారని ఎద్దేవా చేసారు.తెలంగాణలో నిజాం కు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య, షాయబుల్లాఖాన్, రాంజీ, చాకలి అయిలమ్మ, కొమురం భీం ల పోరాట స్ఫూర్తి తో పని చేస్తాంమన్నారు.ఇక్కడ హిందువులు, ముస్లింలు కలిసి నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వతంత్ర దినోత్సవంగా అధికారికంగా జరుపుతామన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్, సంబాని చంద్రశేఖర్, నాయకులు కోదండ రెడ్డి, హర్కర వేణుగోపాల్, కుమార్ రావ్, బొల్లు కిషన్, వినోద్ కుమార్, నగేష్ ముదిరాజ్, మానవతా రాయ్, కల్వ సుజాత, నూతి శ్రీకాంత్, మెట్టు సాయి కుమార్, సేవదల్ చైర్మన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Previous articleప్ర‌పంచ శాంతికి అతిపెద్ద విఘాతంగా మారుతున్న‌ తీవ్ర‌వాదం షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ స‌ద‌స్సులో ప్ర‌ధాని మోదీ ఆందోళన
Next articleపోడు భూముల స‌మస్యప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వం కృషి అటవీ శాఖ మంత్రి అల్లోలఇంద్రకరణ్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here