Home ఆంధ్రప్రదేశ్ లాఠీ చార్జీ చేయలేదు

లాఠీ చార్జీ చేయలేదు

284
0

అనంతపురం
అనంతపురం ఎస్ఎస్బీఎన్ కళాశాల వద్ద పోలీసులు లాఠీ చార్జి చేయలేదు. విద్యార్థులను కళాశాలలోకి వెళ్లకుండా ఆటంక పరుస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసారని అనంతపురం పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులపై విద్యార్దులు రాళ్లు రువ్వారు. దీంతో గాయపడిన ఓ విద్యార్థినిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. స్వల్ప గాయాలైన సదరు విద్యార్థికి ప్రమాదమేమి లేదని డాక్టర్లు  వెల్లడించారు. జిల్లా సర్వజన ఆసుపత్రి ముందు రహదారిపై వాహనాల రాకపోకల అంతరాయనికి యత్నించిన విద్యార్థులను చెదరగొట్టామని పోలీసులు తెలిపారు.

Previous articleడుంబ్రిగుడ చాపరాయి లో పర్యాటకులు సందడి మన్యం అందాన్ని తిలకించేందుకు తరలివచ్చిన జనం
Next article10న వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో సిఎం కేసీఆర్‌ పర్యటన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here