తిరుపతి,మా ప్రతినిధి,అక్టోబర్ 07
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం గురువారం మినీ కల్యాణకట్టను ఆలయ అధికారులు పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఆలయంలోని కల్యాణమండపం పక్కన మినీ కల్యాణ కట్టను ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు, తిరుమలకు వెళ్లే భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించేందుకు అనువుగా ఉంటుంది. తలనీలాలు సమర్పించే భక్తుల కోసం ఇక్కడ స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.