Home తెలంగాణ దివంగత నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతి,గొప్ప నాయకుడు ఆయన భౌతికంగా దూరమై ఏడాది గడుస్తున్నా.....

దివంగత నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతి,గొప్ప నాయకుడు ఆయన భౌతికంగా దూరమై ఏడాది గడుస్తున్నా.. ఆయన జ్ఞాపకాలు ఇంకా పదిలంగా ఉన్నాయి ఉద్యమ ప్రారంభం నుంచి మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి కి సన్నిహితులు -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

88
0

హైదరాబాద్
లోయర్ ట్యాంక్ బండ్ లోని పింగళి వెంకట్ రామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మాజీ హోమ్ శాఖ మంత్రి స్వర్గీయ నాయిని నరసింహ రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి మనోధైర్యం చెప్పారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.దివంగత నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతి,గొప్ప నాయకుడని కొనియాడారు.ఆయన భౌతికంగా దూరమై ఏడాది గడుస్తున్నా.ఆయన జ్ఞాపకాలు ఇంకా పదిలంగా ఉన్నాయన్నారు.ఉద్యమ ప్రారంభం నుంచి మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారికి సన్నిహితులని,ఆయన ఏ విషయం అయినా దాచుకోకుండా మొఖం మీద మాట్లాడే ముక్కుసూటి మనిషని ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Previous articleసిసి కెమెరాలను ప్రారంభించిన ఏ.ఎస్పీ అనోన్య
Next articleమా అధ్య‌క్షులు, ప్ర‌ముఖ స్టార్ హీరో మంచు విష్ణు చేతులు మీదుగా విడుద‌లైన రావ‌ణ‌లంక ట్రైల‌ర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here