జగిత్యాల, నవంబర్ 9
వానరులు ప్రత్యక్షంగా పంటలను తింటే బీజేపీ,టీఆర్ఎస్ పార్టీల నేతలు పరోక్షంగా తింటూ వానరులను మించిన వానరులయ్యారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ చైతన్య దీక్ష జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి బాపురెడ్డి అధ్యక్షతన చేపట్టగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు.ఈ సంధర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించక కెసిఆర్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆన్నారు.వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉండి ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరచిన కెంధ్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు తిట్టుకుంటు మద్దతు ధర కల్పించక రైతుల జీవితాలథో చెలగాటమాడుథున్నారని ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం నిలిపివెసింధని మద్దతు ధర కల్పించాల్సి0ధి జిల్లా రెవెన్యూ యంథ్రంగనిధని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 1 లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కెసిఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ వేయక, ఎన్నికల ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతీ అమలుచేయక నిరుద్యోగుల జీవితాలథో చెలగాటమడుథున్నరని జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
Home తెలంగాణ వానరులను మించిన వానరులు బీజేపీ,టీఆర్ఎస్ నేతలు బీజేపీ,టీఆర్ఎస్ తోడు దొంగలు పెట్రోల్,డిజిల్ ధరల పెంపుతో సామాన్యులపై...