Home తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి పెన్షనర్ల సమస్యలు జగిత్యాల...

ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి పెన్షనర్ల సమస్యలు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

108
0

జగిత్యాల సెప్టెంబర్ 30
పెన్షనర్ల సమస్యలు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా,డివిజన్, మండలాల పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసి  పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఎమ్మెల్యే కు తమ సమస్యలు విన్నవించారు. పీఆర్సీ బకాయిలు ఒకే దఫాలో సత్వరం చెల్లించాలని,పెన్షన్ ప్రతి నెల  మొదటి తేదీన చెల్లించాలని,కరువు భత్యం చెల్లింపులో జాప్యం జరుగుతోందని,2018 తరువాత రిటైర్డ్ అయిన ఉద్యోగుల కు,ఉపాధ్యాయులకు పెరిగిన గ్రాట్యుటీ,లీవ్ ఎన్క్యాష్మెంట్,తదితర ప్రయోజనాలు సత్వరమే చెల్లించాలని,2018 తరువాత రిటైర్ అయిన వారి రివైజ్డ్ పెన్షన్ ఆర్డర్లు ఇంతవరకు  రాలేదని,పెన్షనర్స్ వైద్యఖర్చుల బిల్లులు పెండింగులో ఉన్నాయని వెంటనే చెల్లింపులకు ఆర్ధిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.అంతే కాక జగిత్యాల జిల్లా కేంద్రంలో పెన్షనర్స్ కు,ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు,జర్నలిస్టులకు  ఆరోగ్య కార్డులపై నగదురహిత   వైద్యసేవలు పొందడానికి వీలుగా జగిత్యాల జిల్లా కేంద్రములో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయించాలని తమ అసోసియేషన్ తరపున కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారిగా గౌరిశెట్టి విశ్వనాథం, జిల్లా అస్సోసియేట్  సహ అధ్యక్షులు అంకారపు రగుపతి,పి.సి.హన్మంత రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు మున్సిపల్ యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రె విద్యాసాగర్,జాయింట్ సెక్రెటరీ ప్రకాష్ రావు, మహిళా కార్యదర్శి బోబ్బాటి కరుణ, కొరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,కార్యదర్శి రాజ్ మోహన్,జగిత్యాల యూనిట్ అధ్యక్షుడు  వి.ప్రకాష్ , ధర్మపురి అధ్యక్షుడు దొంతుల లక్ష్మికాంతం, మెటపల్లి అధ్యక్షుడు రాయల్, కార్యదర్శి గంగాధర్,మల్యాల అధ్యక్షుడు ఎం.డీ.యాకుబ్, నాయకులు  అలిశెట్టి ఈశ్వరయ్య,రమణ, చంద్రమౌళి,ఎక్సైజ్ రజాక్, గంగాధర్ గడ్డమీది, శంకరయ్య,స్వామి,గంగాధర్, సత్యనారాయణ,ప్రేమ్ సాగర్, నారాయణ,విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Previous articleప్రకృతి వనం ను పరిశీలించిన కలెక్టర్ వర్క్ ఫైల్ సక్రమంగా ఉండేలా చూడాలి
Next articleనెల్లూరులో 2 రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాలి రైల్వే జీఎంకు ఎంపీ ఆదాల వినతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here