న్యూఢిల్లీ నవంబర్ 23
కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. నిన్న 8 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య ఇవాళ తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,579 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 543 రోజుల కనిష్ఠానికి రోజువారీ కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 236 మంది మరణించగా, మరో 12,202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,13,584 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 536 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు చేరుకున్నాయి. కేరళలో నిన్న 3,698 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 75 మరణించారు.