విజయవాడ
ఇంద్రకీలాద్రి వద్ద అధికారుల అత్యుత్సాహం ప్రదర్శించారు. మంగళవారం నాడు అమ్మావారి దర్శనానికి వచ్చిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వాహనాన్ని ఘాట్ రోడ్డు ప్రారంభంలోనే పోలీసులు నిలిపివేసారు. స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ పాటించక పోవడం పై ఎంపీ అసహనం వ్యక్తం చేసారు. తన కుటుంబ సభ్యులతో కలసి కాలి నడకనే ఇంద్రకీలాద్రి పైకి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించి నడిచి కిందకు వచ్చారు. వీఐపీ పాస్ లతో ఇతర వాహనాలను అనుమతిస్తూ ఎంపీ వాహనాన్ని అడ్డుకోవడంపై ఎంపీ సహాయకులు మండిపడ్డారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి