Home తెలంగాణ హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో 39మంది అభ్యర్థులు

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో 39మంది అభ్యర్థులు

99
0

హైదరాబాద్ అక్టోబర్ 13
హుజురాబాద్ ఉప ఎన్నికలో భాగంగా ఇటీవల నామినేషన్ పలువురు నాయుకులు విత్ డ్రా  చేసుకున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేంద్రర్‌ సతీమణి ఈటల జమున, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి రాజ్ కుమార్ తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. మొత్తం ఇప్పటి వరకూ 42మంది బరిలో ఉండగా ముగ్గురు విత్ డ్రా చేసుకున్నారు.ఇంకా బరిలో 39మంది అభ్యర్థులు 31మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఐదుగురు వివిధ పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అభ్యర్థుల ఆధారంగా ఈవీఎంల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో ఈవీఎంలో 15మంది అభ్యర్థులు, 1నోటా కలిపి 16మందికి అవకాశం ఉండనుంది. ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లు, నెంబర్లతో అక్షరక్రమంలో సింబల్స్ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Previous articleపూజా హెగ్డేకు బర్త్ డే విషెస్ చెప్పిన ‘రాధే శ్యామ్’ టీం..
Next articleప్యాకింగ్‌పై విక్రేతల పేరు ఫిర్యాదుల అధికారి నంబర్‌ను స్పష్టంగా ఉండాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here