Home ఆంధ్రప్రదేశ్ గిరి గ్రామ దర్శన్ లో పల్గోన్న ముగ్గురు ఎంపీలు

గిరి గ్రామ దర్శన్ లో పల్గోన్న ముగ్గురు ఎంపీలు

305
0

విశాఖపట్నం
అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి,  కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత, కేరళ అల్తుర్ పార్లమెంట్ సభ్యులు  రమ్య హరిదాస్ గురువారం నాడు అరకు వ్యాలీ మండలంలోని పెదలబుడు గ్రామంలోని ” గిరి గ్రామ దర్శన్ ” సందర్శించారు. ఈ సందర్భంగా గొడ్డేటి మాధవి మీడియాతో మాట్లాడుతూ కనుమరుగవుతున్న  గిరిజన సాంప్రదాయాలను నేటి తరానికి కళ్లకు కట్టే విధంగా చూపించడమే ఈ  ” గిరి గ్రామ దర్శన్ ” యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. కనుమరుగవుతున్న గిరిజన సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా  అచ్చమైన గిరిజన సంప్రదాయాలను  తిలకించాలి అనే  పర్యాటకులకు అరకు మండలం పెదలబుడు గ్రామంలోని   ” గిరి గ్రామ దర్శన్ ” సందర్శించవలసిందిగా కోరారు. సహచర పార్లమెంటు సభ్యులతో కలిసి గిరిజన సాంప్రదాయ  వేషధారణ ధరించిన అరకు ఎంపీ, అక్కడ ఏర్పాటుచేసిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Previous articleకొండమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
Next articleమాన‌వాళిని ముంచెత్తుతున్న వాయు కాలుష్యం ప్ర‌తి ఏటా 70 ల‌క్ష‌ల మంది అకాల మ‌ర‌ణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here