Home ఆంధ్రప్రదేశ్ బంగారు గుడిని దర్శించిన టీటీడీ చైర్మన్ దంపతులు

బంగారు గుడిని దర్శించిన టీటీడీ చైర్మన్ దంపతులు

90
0

వేలూరు సెప్టెంబర్ 18,
తమిళనాడు రాష్ట్రంలోని  వేలూరులో గల నారాయణి అమ్మ  బంగారు గుడిని శనివారం టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు దర్శించారు.  ఆలయం వద్దకు చేరుకున్న  సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ అధికారులు సంప్రదాయంగా స్వాగతం పలికారు.  ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. తరువాత బంగారు మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేసి హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అభిషేకంలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు చైర్మన్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందించారు.   అనంతరం చైర్మన్ దంపతులు పీఠాధిపతి  నారాయణి అమ్మను కలిశారు.

Previous articleవైద్య సిబ్బందికి ఎన్ 95 మాస్కులు పంపిణీ బి యస్ నారాయణ రెడ్డి
Next articleట్ల లెక్కింపునకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here