తిరుమల, మా ప్రతినిధి నవంబర్08
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి
శ్రీ స్వరూపానంద స్వామి పుట్టినరోజు సందర్భంగా సోమవారం టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వామి వారికి శుభాకాంక్షలు తెలియజేసి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానంద స్వామికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ఆలయ ఓఎస్డి పాల శేషాద్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు